-
సూపర్ఫాస్ట్గా మారిన సికింద్రాబాద్- తిరువనంతపురం శబరి ఎక్స్ప్రెస్
-
నేటి నుంచి అమల్లోకి వచ్చిన మార్పులు
-
17229/30 నుంచి 20629/30గా మారిన రైలు నంబర్
సికింద్రాబాద్-తిరువనంతపురం (త్రివేండ్రం) మార్గంలో తరచూ ప్రయాణించే వారికి రైల్వే శాఖ ఒక శుభవార్త అందించింది. ఈ రూట్లో ఎంతో ముఖ్యమైన శబరి ఎక్స్ప్రెస్ను తాజాగా సూపర్ఫాస్ట్ రైలుగా ఉన్నతీకరించింది. ఈ మార్పులు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. రైలు వేగం పెరగడం వలన ప్రయాణికులకు సుమారు రెండు గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది. ఈ కీలక మార్పులో భాగంగా రైలు నంబర్ను కూడా మార్చారు. ఇంతకుముందు 17229/30 నంబర్లతో నడిచిన ఈ రైలు, ఇకపై 20629/30 నంబర్లతో సూపర్ఫాస్ట్గా పరుగులు పెట్టనుంది. వేగం పెంచడంతో పాటు, ప్రయాణ వేళల్లో కూడా అధికారులు ముఖ్యమైన మార్పులు చేశారు.
కొత్త టైమింగ్స్ (సెప్టెంబర్ 30, 2025 నుండి)
ఈ మార్పుల వలన ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు మరింత వేగంగా, సౌకర్యవంతంగా చేరుకోవచ్చని రైల్వే వర్గాలు తెలియజేశాయి.
Read also : USGovernment : అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల సంక్షోభం: చరిత్రలోనే అతిపెద్ద సామూహిక నిష్క్రమణ
